శ్రీ పరమాత్ముడు "అక్షర" జీవరాశికి చెందినవాడు

ముందు గడిచిన శ్లోకం 4:6లో తన గూర్చి శ్రీ పరమాత్ముడు చెప్పుకున్న విధంగా శ్రీ పరమాత్ముని ప్రత్యేక గుణాలు నాలుగు వర్ణించబడ్డాయి. సర్వశక్తి సంపన్నుడైన సర్వేశ్వరునిలోనూ ఈ గుణాలు ఉన్నాయి. కానీ అతడు (పరమాత్ముడు) సర్వేశ్వరుడు కాదు. అయితే స్వర్గలోకాల నుండి దిగి వచ్చిన ఈ పరమాత్ముడు ఎవరు? అనే సంశయం సహజంగా అందరికీ కలుగుతుంది. ఈశ్వరునిలో ఉన్న కొన్ని గుణాలు కలిగి యున్నట్లు కనిపిస్తున్న ఈ అస్తిత్వం ఎవరిది? అనే సందేహ నివృత్తికై మీ దృష్టిని ఈ క్రింది శ్లోకాల వైపు సారించమనవి. గీతా ప్రకారం జీవులలో రెండు తరగతులను మనము చూడగలము. అందులో ఒకటి నశించే గుణము కలవి అంటే భూమిపై జన్మించిన సమస్త జీవరాశులు ఈ కోవకు చెందుతాయి. ఇక రెండవది స్వర్గలోకాలకు చెందిన సమస్త జీవరాశులు మరియు ఆత్మలు (SPIRITS) ఇవి నశింపు లేనివి.

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్చతే.
ప్రపంచమునందు క్షరుడనియు, అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణుల యొక్క దేహములు క్షరులనియు, కూటస్థుడగు జీవుడు అక్షరుడనియు చెప్పబడుచున్నారు. - గీతా 15:16

ప్రపంచములో రెండు రకాల జీవులున్నాయి.అవి నశించేవి (క్షరములు), నశింపనివి (అక్షరములు) మార్పులు చెందకుండా స్థిరముగా ఉండే తమతమ అసలు ఆకారము కలిగి ఉండేవి.

జీవులలో నశించిపోయే గుణము గల జీవులన్నీ ఒక తరగతికి చెందినవి మరియు మార్పులు చెందకుండా స్థిరంగా వారి సహజ ఆకారంలో ఉండేవి రెండవ తరగతికి చెందినవి. జీవరాశి రెండు తరగతులుగా విభజించబడింది. సర్వశక్తి సంపన్నుడైన ఈశ్వరుడు భూమిపై మానవజాతిని సృష్టించాడు అంతేకాక, పరలోకాల్లో విలసిల్లే మరొక జాతి జీవులను కూడా సృష్టించాడని, వారు మానవుల లక్షణాలకు విరుద్దమైన గుణాలు కలిగి ఉంటారనే విషయం దీని ద్వారా స్పష్టించాడని, వారు మానవుల లక్షణాలకు విరుద్దమైన గుణాలు కలిగిఉంటారనే విషయం దీని ద్వారా స్పష్టమయ్యింది. వీరిని గురించి పై శ్లోకంలో చెప్పినట్లు తమ ఆకార స్వరూపాలలో ఎటువంటి మార్పులు చెందకుండా స్థిరంగా ఉంటారని మరియు వీరికి నాశనము (చావు) లేదని గ్రహించాలి. ఈ రెండు ప్రకృతి సిద్దమైన గుణాలు వీరిని జన్మరహితులనడానికి సాక్షాధారాలుగా ఉన్నాయి. కాబట్టి అర్జునుని ముందు భయంకర స్వరూపంలో కనబడి "నేను చావు పుట్టుకలు లేని వాడను" అని పరిచయం చేసుకున్నవానినే సర్వేశ్వరుడు అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ 15:16 శ్లోకంలో వర్ణించినట్లు అతను చావుపుట్టుక లేకుండా సృష్టింపబడిన జీవరాశులలోని ఒకడు మాత్రమే అని తెలుసుకోవాలి. ఈ వాస్తవాలు రాబోవు వాదనలలో సమర్ధవంతంగా నిరూపించబడగలవు. గీతలోలాగే, ఖురాన్లో కూడా శాశ్వతమైన జీవితాన్ని పొంది, ఆకాశాలలో నివశించే జాతిని గురించి ప్రస్తావించడం జరిగింది. "శాశ్వతమైన జీవితం"అనే అంశం, చావుపుట్టుకలు లేవు మరియు స్థిరస్వరూపులు అనే విషయాన్ని గీతా 4:6 లో పేర్కొన్న దాని ప్రకారం దానంతట అదే వెల్లడైపోతుంది. మానవజాతికి పూర్వీకులైన మెదటి దంపతుల గురించి ఇక్కడ గుర్తుకు తెచ్చుకుందాము. స్వర్గం నుండి గెంటించి వేయాలనే కుట్రతో షైతాను (మాయ) వారిని ఎలా పురికొల్పాడో చూడండి.

"ఈ చెట్టు వద్దకు వెళ్లవద్దని దేవుడు శాసించింది ఎందుకంటే మీరు దేవతలలాగే అమర్త్వాన్ని పొంది శాశ్వతంగా ఉండిపోతారేమోనని" (ఖురాన్ 7:20). ఈ వాక్యాల వలన మానవుని జీవితం శాశ్వతం కాదని, దేవతలు పరలోకాలలో శాశ్వతంగా ఉండిపోయే అమరులని స్పష్టమవుతుంది. గీత మరియు ఖురాన్ ల ప్రకారం కూడా రెండు రకాలైన జీవరాశులున్నాయని తెలిసింది.

బైబిల్ : మరియు ఆకాశవస్తు రూపములు కలవు భూవస్తు రూపములు కలవు. ఆకాశవస్తు రూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు. 1వ కోరింధీయులకు 15:40
(దయచేసి ఇంగ్లీష్ వర్షన్ లో చూడండి)
THERE ARE ALSO CELESTIAL BODIES AND BODIES TERRISTRIAL : BUT THE GLORY OF THE CELESTIAL IS ONE AND THE GLORY OF THE TERRISTRILIS ANOTHER. - 1 CORINTHIANS 15:40

ఆ తరువాత శ్లోకంలో సర్వశక్తి సంపన్నుడైన సర్వేశ్వరుడు ఈ రెండు రకాల జీవులకు అతీతమైనవాడని బహిర్గతమవుతుంది.

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః
యో లోకత్రయమావిశ్వ బిభర్త్యవ్యయఈశ్వరః
ఎవడు మూడులోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో, అట్టి నాశరహితుడును, జగన్నియామకుడును, వేరైనవాడును నాగు ఉత్తమపురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు -గీత 15:17

సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు ఉత్తమపురుషునిగా పరమ+ఆత్మగా వర్ణించబడ్డాడు. మన చర్చనీయాంశమైన శ్రీపరమాత్ముడే స్వయంగా సర్వశక్తి సంపన్నుడైన సర్వేశ్వరునిగా భావించడంలో ఇదే విషయం తప్పుదోవ పట్టించింది. సందర్భానుసారంగా కొన్ని మాటలు వేరువేరు అర్ధాలు ఇవ్వడమే కాకుండా, ఒక్కొక్కప్పుడు ఈ అర్ధాన్ని ఇతర వ్యక్తులను కూడా సూచిస్తాయి. ఉదాహరణకు ఆత్మ అనే మాట సర్వసాధారణంగా మనిషిలో ఉండే అంతరాత్మకు అర్ధంగా వాడతారు. కానీ కొన్ని సందర్భాలలో ఇదే మాట వ్యక్తులను గురించి సూచిస్తుంది.

ఉదాహరణకు 
జితాత్మ = మనసును జయించినవాడు (6:7)
తృప్తాత్మ = తృప్తీని పొందినవాడు (6:8)
మహాత్మ = గొప్పవాడు (శ్రీకృష్ణుడు) (11:37)
మహాత్మ = గొప్పవాడు (అర్జునుడు) (18:74)
పరమాత్మ = పవిత్రమైనవాడు  (శ్రీకృష్ణుడు) (13:23)
పరమాత్మ = పవిత్రమైనవాడు (ఇంద్రియములను జయించినవాడు) (6:7)
కామాత్మ = ఇంద్రియ కోరికల వలన సంతృప్తి చెందగోరువాడు (2:43)
అవ్యయాత్మ = నాశనము కాకుండా ఉండువాడు (4:6)
సంశయాత్మ = సందేహము కలిగినవాడు (4:40)
మహాత్మానాః = గొప్ప గొప్ప ఆత్మలు, సత్పురుషులు (9:13)

పరమాత్ముడు అనేది శ్రీకృష్ణుని బిరుదు. ఇది ఇతని గొప్పతనాన్ని సూచిస్తుంది.  గీతలో 6:7 శ్లోకములో సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనిషినుద్దేశించి ఇలా వర్ణించాడు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు పరమాత్ముడు. అనగా ఇంద్రియములను జయించువాడు పరమాత్ముడు. ఇక్కడ రెండు రకాల పరమాత్ములున్నారు. ఒకరు శ్రీకృష్ణుడు, మరొకరు తన మనసును అదుపులో ఉంచుకున్నవాడు. మరి ఈ ఇద్దరి వ్యక్తుల హోదాలు సమానమౌతాయా? ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసము లేదా? శ్రీకృష్ణుడు మహాత్ముడు (11:37), శ్రీ అర్జునుడు కూడా మహాత్ముడుగా (18:74) పిలువబడ్డాడు. ఇద్దరికీ మహాత్ముడనే బిరుదులు లభించినంత మాత్రాన అర్జునుడికి, శ్రీకృష్ణుడికి వ్యక్తిగత హోదా ఒకటే అవగలదా? అర్జునుడిని, శ్రీకృష్ణుడితో పోల్చవచ్చా? నిష్కల్మషమైన మనస్సుతో అనన్య మనస్కులై దేవుని ఆరాధించేవారు "మహాత్మానాః అనబడతారని గీత చెబుతుంది. ఆరాధించేవారంతా (మహాత్మానాః) అర్జునుడు లేక కృష్ణునితో సమానులవుతారా? ఈ ముగ్గురిని సమానహోదాతో చూడగలమా? మనం గొప్పవాళ్లను మహాత్ములని పిలుస్తాము. (ఉదా:- మహాత్మాగాంధీ). సర్వోన్నతుడైన ఈశ్వరుని మనం ప్రభువు అని పిలుస్తాము. కోర్టులో మేజిస్ట్రేట్ లను, జడ్జీలను "మిలార్డ్" అని సంభోధించడం మనం వింటుంటాం. కానీ ఈ జడ్జీలకిచ్చే "లార్డ్" అనే బిరుదును పురస్కరించుకుని సర్వేశ్వరుడిని, జడ్జీల హోదాను సమాన దృష్టిలో చూస్తామా? సర్వేశ్వరుని పరమాత్ముడని పిలవడం అంగీకరించవలసిన విషయమే. ఎందుచేతనంటే ఆయన ప్రతి అంశంలోనూ పరమశ్రేష్టమైనవాడు (7:7). గొప్పవాడై ఉండి పరమాత్మునిగా (గొప్ప పురుషుడు అనే అర్ధంలో) పిలవబడేవాడు ఎవడైనప్పటికీ లేక ఎవరైనా ఎవరినైనా అలా సంబోధించి పిలిచారనుకోండి లేక సర్వేశ్వరుడే స్వయంగా ఈ బిరుదును ఎవరికైనా ప్రసాదించినా వారు భువిలోని వారైనా లేక ఆకాశాలకు చెందినవారైనా, వారెవరూ ఇంకా చివరకు పరమాత్ముడు కూడా సాక్షాత్తు సర్వోత్కృష్టుడైన ఈశ్వరునితో సరిపోల్చబడరు; సర్వేశ్వరుదూ కాలేదు. 15:17 శ్లోకములో పేర్కొనబడిన పరమాత్ముదనే పదము కేవలం ఒకే ఒక్కడు సర్వోన్నతుడైన సర్వేశ్వరునికే తప్ప మరెవరికీ వర్తించాడు. మన ప్రస్తుత చర్చనీయ అంశములో ఉన్న ఆకాశలోకాలకు చెందినవాడు, సనాతన ధర్మాన్ని పునః స్థాపించడానికి నియమింపబడినవాడయిన వానికి పరమాత్మ అనే ఈ బిరుదు సందర్భానుసారం ఇక్కడ వర్తించనే వర్తించదు. సరిగా చెప్పాలంటే శ్లోకము 15:17 లోని పరమాత్ముడు (సర్వేశ్వరుడు) మరియు 15:16లోని అక్షర తరగతికి చెందిన పరమాత్ముడు వీరిద్దరూ ఒకే వ్యక్తిత్వం గల వారు కారు. రాబోవు వాదనలు ఈ అంశాన్ని ఇంకా స్పష్టంగా విశదీకరిస్తాయి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు తాను సర్వజీవ రాశులకంటే, వారు ప్రపంచములోని వారైనా పరలోకమందలి దేవగణములైనా వారందరి కంటే అతీతమైన, ఉన్నతమైన, ప్రత్యేకమైన వ్యక్తిత్వము కలిగియున్నానని వేరొక శ్లోకములో చెబుతున్నాడు.

యస్మాత ర మతీతో హమాక్షరాదపి చోత్తమః
అతోస్మి లోకేవేదే చ ప్రధితః పురుషోత్తమః
నేను క్షరస్వరూపుని కంటే మించినవాడను, అక్షర స్వరూపునికంటే శ్రేష్టుడను అయి యున్నందువలన ప్రపంచమునందును, వేదము నందును "పురుషోత్తము"డని ప్రసిద్ధికెక్కి యున్నాను. - గీత 15:18 
Next Page : 6
spacer

4. యోగేశ్వరుడు - మానవకోటి జ్ఞానోదయం కొరకు నియుక్తుడైనవాడు

4-yogeshwara-man-who-is-enlightened-man-for-enlightenment
4. యోగేశ్వరుడు - మానవకోటి జ్ఞానోదయం కొరకు నియుక్తుడైనవాడు
4. సమస్త ప్రాణులకు ప్రభువు
"భూతానామ్ ఈశ్వరోపినన్"  భూతానామ్ = జన్మించిన సమస్త ప్రాణికోటి , ఈర్వర = ప్రభువు

పుట్టిన ప్రతి జీవికి తాను ప్రభువునని ప్రమాత్ముడు వివరించాడు. ప్రస్తుత చర్చనీయాంశ విషయానికి వస్తే "భూతానామ్ ఈశ్వరః" అనే వాక్యానికి సమస్త మానవ జాతికి ప్రభువని అర్ధం. "భూతానామ్" అనేది ఇక్కడ ప్రత్యేకంగా మానవజాతినుద్దేశించే చెప్పబడింది. అయితే ధార్మిక గ్రంధాల ఆధారము లేకుండా ఇది ఎలా చెప్పగలరు? అని అడగవచ్చు. దీనికి మా వివరణ ఏమిటంటే -"జన్మించని పరమాత్ముడు " "జన్మించిన వారందరికీ తాను ప్రభువు"ను అని చెప్పిన పలుకులు మానవరూపం దాల్చి చెప్పినవి. ఒక పుట్టుకలేని జీవి మానవ ఆకారంలో వచ్చి తాను పుట్టే వారందరికీ ప్రభువునని తనను పరిచయం చేసుకుంటున్నాడంటే "మానవులకు ప్రభువునని మాత్రమే కాని వేరే జీవులకు కాదని చెప్పినట్లు స్పష్టమవుతుంది. పైగా యోగాభ్యాసము చేయవలసిన అవసరం మానవునికి తప్ప ఏ ఇతర జీవికి కూడా లేదు. కనుక ప్రమాత్ముడు మానవజాతికి మాత్రమే ప్రభువు (యోగేశ్వరుడు). యోగేశ్వరుడు అనేది పరమాత్మకు మరొక పేరు (గీతా 11:4,9)

పరం యోగం యోగేశ్వరః
పరం =  సర్వోత్కృష్టమైన, పరమ శ్రేష్టమైన 
యోగం = ప్రోక్తించబడిన జ్ఞానం
యోగేశ్వరః (యోగ+ఈశ్వర) = యోగమునకు లేక జ్ఞానబోధకు ప్రభువు

వ్యాసప్రసాదాచ్చుతవా నేతద్గుహ్యాతమం పరమ్
యోగం యోగేశ్వరాత్కృష్ణాత్సాక్షాత్క థయతస్స్యయమ్. గీత 18:75
శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహమువలన, నేను అతి రహస్యమైనదియు, మిగుల శ్రేష్టమైనదియునగు ఈ యోగశాస్త్రమును స్వయముగనే అర్జునునకు చెప్పుచున్న యోగేశ్వరుడగు శ్రీ కృష్ణుని వలన ప్రత్యక్షముగా వింటిని. 

కాబట్టి ఈ రెండు క్లాజులు అనగా 4:6 యొక్క "భూతానాం ఈశ్వరః" మరియు 18:75 యొక్క "యోగేశ్వర" అనే మాట సమస్త మానవజాతికి జ్ఞానోదయాన్ని కలిగించే గురువు శ్రీపరమాత్ముడని నిరూపిస్తున్నాయి. అయితే జ్ఞానోదయాన్ని ప్రసాదించడానికి స్వర్గలోకాల నుండి ఈయన రాక కేవలం భారతదేశానికే పరిమితం కాదు అని ఇంకా ఆయన రాకడ ఉద్దేశం యావత్ ప్రపంచంలో మనుగడ సాగించే సమస్త మానవజాతికి జ్ఞానోదయం కలిగించడం అని విశదమౌతుంది. ఎయా కారణంగానే ఆయన జగద్గురువుగా పేరు గాంచాడు. (11:43). ఇది "భూతానాం ఈశ్వరః" అనే మాటకు సరియైన అర్ధం. ఆయన సర్వమానవజాతికి యోగము ప్రసాదించే ప్రభువుగా గాక విశ్వంలోని సర్వస్వానికి ప్రభువుగా ప్రజలు అపోహలు పడుతున్నారు. ఈ విధంగా యోగేశ్వరుడిని లోకేశ్వరుడిగా, సర్వేశ్వరునిగా భ్రమపడి ఈశ్వరత్వం ఆయనకు ఆపాదించడం జరిగింది.
spacer

3.పరమాత్ముని అవతారాన్ని సర్వేశ్వరుని అవతారంగా భ్రమించడం జరిగింది

incarnation-of-paramatma-was-incarnated

"ఇంత భయంకర ఆకారము గల మీరు ఎవరు?" మరియు "మీ ప్రవృత్తి ఏమిటి?, మిమ్మును గూర్చి తెలిసికొన గోరుచున్నాను" అనేవి మూడు సందేహాలు

అర్జునుడు శ్రీ పరమాత్మున్ని సర్వేశ్వరునిగా భావించడం లేదనే విషయాన్ని ఈ రెండు ప్రశ్నలు ధ్రువపరుస్తున్నాయి. అర్జునుడు అతనిని సర్వేశ్వరునిగా గుర్తించి ఉంటే "నీవు ఎవరవు? నీ ప్రవృత్తి ఏమిటి?" అని ప్రశ్నించి ఉండేవాడు కాదు. అయినా దేవోత్తమా ఆది పురుషుడు, నీకు నమష్కారము, నన్ననుగ్రహింపు (11:31) వంటి మాటలు పరమాత్ముడి స్థాయిని సర్వేశ్వరుని స్థితికి తీసుకువెళ్లడానికి చేసిన మానవ విఫలయత్నంగా అద్దం పడుతున్నాయి. అర్జునుని ప్రశ్నకు శ్రీ పరమాత్ముడు సాధారణ మానవరూపంలో ఈ క్రింది విధంగా సమాధానం చెబుతాడు.

అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్
ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా.
నేను పుట్టుకలేనివాడను, నాశరహితస్వరూపముగలవాడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయియున్నప్పటికీ స్వకీయమగు ప్రకృతిని వశపరచుకొని నా మాయశక్తి చేత పుట్టుచున్నాను. - గీత 4:6

పై శ్లోకములో నాలుగు అంశాలు (గుణాలు) కనిపిస్తాయి. అవి మానవ ఆకారములోనున్న శ్రీ పరమాత్ముడి అసలు వ్యక్తిత్వాన్ని స్పష్టపరుస్తాయి.

1. జన్మరహితమైనది. 2.నాశనము లేనిది. 3. మానవాకారముగా అవతారము పొండాగాల స్వయంశక్తి సామర్ధ్యాలు కలిగి ఉండేది. 4. సమస్తజీవులకు ప్రభువు. 

1.అజః (జన్మరహితుడు) : పుట్టుకలేనివానికి మరణం అనే ప్రశ్నే తలెత్తదు కాబట్టి అలాంటివాడు మరణం సంభవించే సామాన్య మానవుడిలా జన్మించడు. జనన మరణాలకు అతీతంగా మనిషే ఉండడు. అందుకే జనన-మరణములు లేని పరమాత్ముడు ఏవిధంగానూ మానవుడు కాలేడు. సర్వశక్తి సంపన్నుడైన సర్వేశ్వరునికి ఈ గుణాలు ఉన్నాయని గ్రంధాల (Scriptures) ద్వారా తెలిసింది. కనుకనే ఈ అంశం ద్వంద్వార్ధలకు దారి తీసి అపోహలకు  ప్రధాన కారణమైంది. అది కాలక్రమేణా (మానవరూపంలో వచ్చిన) పరమాత్ముని అవతారాన్ని ఈశ్వరావతారమని నమ్మించి చివరకు పరమాత్ముడంటేనే సర్వేశ్వరుడనే అపోహకు దారి తీసింది.

2. అవ్యయాత్మ : నశింపనివాడు (నాశనము లేనివాడు) :శించేగుణం లేని లేక ఎటువంటి మార్పులు చెందనిది. ఈ గుణము మానవనైజానికే వ్యతిరేకము. ఎందుకంటే మానవుడు ముందు పసివానిగా జన్మిస్తాడు. క్రమేణా బాల్యదశకు, ఈ బాల్యము యవ్వనదశకు మారుతుంది. ఈ విధంగా మానవ శరీరము ఒకదశ నుండి మరొక దశకు మారిపోతుంది. ఇక్కడ నుండి క్షీణదశ ప్రారంభం అవుతుంది. క్రమేపీ వృద్దాప్యానికి చేరుకుని చివరకు మనిషి మరణిస్తాడు.

    పరమాత్ముని గురించి చెప్పాలంటే ఆయన తన గురించి చెప్పుకున్నట్లు ఆయనకు తనదంటూ ఒక స్వరూపం ఉంది. అది పైన వర్ణించిన నశించే గుణాలు మార్పులూ లేకుండా ఉంటుంది. ఈ భేదాలను అవగాహన చేసుకుంటే, పరమాత్ముడు మానవ మాత్రుడు కాడని తెలుస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నవాడే. అందువలన శ్రీ పరమాత్మునికి దైవత్వం ఆపాదించడంలో ఈ అంశం కూడా బలం చేకూర్చింది. అంటే సర్వేశ్వరుడే స్వయంగా శ్రీ పరమాత్మునిగా అవతారము ఎత్తుతాడనే భ్రమ కలగడానికి కారణమైంది.

జన్మించినవాడు అవతారము కాజాలడు
సంభవామి = నేను అవతారమును పొందుదును, నేను ప్రత్యక్షపరచు కొందును.

3. అవతారము = మానవ రూపము దాల్చడం : పుట్టుకలేనివాడు మార్పులు చెందని శరీరముతో ఉన్నవాడు. ఇలా అంటే ఆయన ఆకాశమునుంచి భూమిపై మానవశరీరముతో దిగి వస్తేనే గాని అది సాధ్యపడదు.

అవతారము పొందేవానికి రెండు శరీరాలు ఉంటాయని మనము గ్రహించాలి. ఒకటి అతని సొంత శరీరము, మరొకటి అవతారము పొందిన శరీరము. అయితే అవతారములో ఉన్న శరీరము తన పని ముగించుకుని తిరిగి సొంత శరీరముగా మారినప్పుడు అవతారములో కనిపించిన శరీరము మాయమయిపోతుంది. ఈ విధముగా ఆయన ఎన్ని అవతారాలు ఎత్తిగా ఉండేది మాత్రం తన స్వంత అస్తిత్వములోనే అది తన సహజ స్వరూపములోనైనా ఉంటుంది. లేదా అవతారరూపంలోనైనా ఉంటుంది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన జనుల మధ్యనే సంచరిస్తూ ఎవరికీ కనబడకుండా ఉండగల సామర్ధ్యము కలిగి ఉన్నవాడు.

మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన అతి సూక్ష్మమైన రూపంలో ప్రవక్త హృదయంలోనికి తిన్నగా ప్రవేశింపగలదు. అంటే అణువుకంటే సూక్ష్మంగా మారి ప్రవక్త హృదయంలో ఈశ్వరజ్ఞానాన్ని అంకురింప జేస్తాడు. దీనినే ఆత్మ+జీవాత్మల కలయిక అంటారు. ఆయన ఏ పరిస్థితులలో ఏ రూపంలో ఉన్నా ఆయనకున్నది ఒకే ఒక సహజ స్వరూపం. అందుచేత తన సహజత్వం గురించి, తన స్వభావాలను, గుణాలను వివరించి చెప్పినడాని ప్రకారం చూస్తే ఎట్టి పరిస్థితులలోనూ ఆ గుణాలు మానవులకు అన్వయింపవు. "సంభవామి ఆత్మ మాయయా" " నా స్వయం మాయాశక్తితో అవతరింతును" కాబట్టి ఈ "సంభవామి ఆత్మ మాయయా" అనే షరతు పరమాత్ముడు మానవరూపంలో ఆకాశము నుండి దిగివచ్చినవాడే కానీ, ఏ కాలంలోనూ ఏ మానవ గర్భకోశము నుండి కూడా జన్మించినవాడు కాదు. పరమాత్మ జన్మించడు గాని తాను కోరిన రూపములో దర్శనమిస్తాడు అనే సత్యాన్ని ఈ విషయం చాలా స్పష్టంగా వివరిస్తుంది.

ఈ సత్యం వెలుగులో తేవడానికి గీతే సాక్షాధారం. శ్రీ పరమాత్ముడు మూడు వేరువేరు రూపాలలో కనిపించాడు.
1.అసాధారణమైన నాలుగు చేతులు కలిగి ఉంది అర్జునునికి మొదట సాక్షాత్కరించిన మానవరూపము.
2.తరువాత సామాన్య మానవరూపంలో కనిపించింది.
3 అర్జునుని కోరిక మేరకు అతనికి చూపించిన విశ్వరూపం. ఇదే తనదైన అసలు సహజసిద్దమైన స్వరూపం (11:47)

ఇప్పుడు ఒక వాస్తవాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. అర్జునుడు విశ్వరూపాన్ని చూసినప్పుడు చాలా భయంకంపితుడయ్యాడు. ఇకపై చూడలేక దీనికి ముందు చూపించిన అసాధారణ చతుర్భుజ మానవ రూపాన్నే చూపమని శ్రీ పరమాత్ముని వేడుకున్నాడు. (11:49). పరమాత్ముని ఆ భయంకరమైన విశ్వరూపం నాలుగు చేతులు గల అసాధారణ మానవరూపముగా ఆ తరువాత సామాన్యమైన మానవ రూపంగా మారిపోయింది.

ఇలా రూపాలను మార్చి భూమి మీదకు అవతారం పొందడం అనేది ఏ మానవ మాత్రునికి సాధ్యం కాదు. పరమాత్ముడు కోరిన రూపాన్ని తన ఇష్ట ప్రకారం పొండాగాల సామర్ధ్యం కలిగి ఉన్నాడని దీని వలన తెలిసింది. "సంభవామి యుగేయుగే" (4:8). ఆయన ఆకాశాల నుండి దిగి వచ్చేవాడు కాబట్టి ఆయన ఏ కాలములోనూ, ఏ స్త్రీ గర్భము నుంచి కూడా జన్మించలేదని, రాబోయే కాలంలో కూడా అలా జన్మించాడనే విషయాన్ని ఈ అంశం అతి స్పష్టంగా బహిర్గతం చేస్తుంది. అయితే ఆయన ఎలా వస్తాడు? ఆయన మానవ ఆకారంలో స్వర్గలోకాల నుండి దిగి వస్తాడు. నిజానికి స్త్రీ గర్భం నుండి పుట్టడం అనే విషయం ఆయన పరమ లక్షణాలకు విరుద్దమైనది. ఎందుచేతనంటే ఈయన ఎవరి వలన జన్మించినవాడు కాదు, ఎటువంటి మార్పులు చెందకుండా స్థిరంగా శాశ్వతంగా ఉండేవాడు. పుట్టుకకు లోనైన ప్రతీ మానవుడూ వివిధ దశలుగా మార్పులు చెండాలి. అలా చివరికి అతను మృత్యువాత పడాలి (2:13,27)అనేది వాస్తవం. దీనిని బట్టి మరో విషయం నిరూపణ కాగలదు.

అదేమిటంటే స్త్రీ గర్భం నుండి జన్మించి ఉన్నవారు ఎవరూ అవతారపురుషులు కాలేరు. అనగా మానవగర్భం నుండి జన్మించిన వానికి తాను అవతరించినవానిగా చెప్పుకునే హక్కు లేదు. మానవులెవరూ అవతారా పురుషులు కాజాలరు అనే యధార్ధాన్ని ఈ అంశము నిరూపిస్తుంది. కనుక మానవుని వలన జన్మించినవారు దేవుని అవతారము అనే వాదన వీగిపోయింది. మానవజన్మ నెత్తినవాడు, నేను అవతారాపురుషుదానాని వాదిస్తే వాడు మోసము చేస్తున్నాడని సులువుగా అర్ధమయి పోతుంది. ఇటువంటి వారిని దేవుని అవతారాలుగా భావించే వారు మాయలో పడ్డారని అర్ధం చేసుకోవాలి.
spacer